ఢిల్లీ హైకోర్టును మరోసారి ఆశ్రయించిన కేజ్రీవాల్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: సీబీఐ అరెస్ట్‌ని సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఆయనను ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జైలుకి తరలించింది. దీనిపై విచారణ జరుగుతుండగానే సీబీఐ కూడా రంగంలోకి దిగింది. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. ఈ మధ్యే అరవింద్ కేజ్రీవాల్‌ని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని రౌజ్ అవెన్యూ కోర్టుని కోరింది. ఈ మేరకు కోర్టు అంగీకరించింది. జులై 12వ తేదీ వరకూ కస్టడీలో ఉంచేందుకు అనుమతినిచ్చింది. ఈ మొత్తం స్కామ్‌లో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని ఈడీ తేల్చి చెప్పగా ఇప్పుడు CBI కూడా అదే వాదిస్తోంది. విచారణ ఇంకా కొనసాగుతోందని కోర్టుకి వెల్లడించింది. అయితే…ఆయన సరిగా సహకరించడం లేదని అసహనం వ్యక్తం చేసింది.

Leave A Reply

Your email address will not be published.