ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇతరుల పదవి కాంక్ష కోసం సాయం చేశానని, ఈ క్రమంలోనే ఏపీలో జగన్, బిహార్ నితిష్తో కలిసి పని చేశానని తెలిపారు. దీనికి బదులుగా కాంగ్రెస్ను బాగు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. గాడ్సే సిద్దాంతాన్ని గాంధీ ఆశయాలతోనే ఓడించగలమనే విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నానని, బీజేపీని అర్థం చేసుకోకుండా దాన్ని ఓడించడం సాధ్యం కాదన్నారు.