నేడు ఢిల్లీకి కిషన్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై  బీజేపీ ఫోకస్ పెట్టింది.రెండో జాబితాపై కసరత్తును కమలదళం ప్రారంభించింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.  రెండో జాబితాలో పొందుపర్చాల్సిన అభ్యర్థుల పేర్లపై కసరత్తు చేయనున్నారు. మరో వైపు బీజేపీ అగ్రనేతలతో కూడ  కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ నెల  22న బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. 52 మందికి తొలి జాబితాలో  చోటు దక్కింది.  మిగిలిన అభ్యర్థులకు రెండో జాబితాలో చోటు కల్పించనున్నారు. ఈ ఎన్నికల్లో  తమకు మద్దతివ్వాలని  బీజేపీ నేతలు  జనసేనను కోరింది. కనీసం తమకు  20 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని  జనసేన బీజేపీని కోరుతుంది.  అయితే ఆరు నుండి  10 అసెంబ్లీ స్థానాలను  జనసేనకు కేటాయించాలని  బీజేపీ భావిస్తుంది.  జనసేనకు కేటాయించాల్సిన స్థానాలు మినహాయించి  ఇతర స్థానాల్లో  అభ్యర్థుల జాబితాపై  బీజేపీ  నాయకత్వం ఫోకస్ పెట్టనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ దఫా  32 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. ఈ జాబితాను ఇప్పటికే ప్రకటించింది. అయితే  ఈ నెల  18న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు.  అయితే తమకు 20 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బీజేపీని కోరినట్టుగా  సమాచారం. అయితే 10 అసెంబ్లీ స్థానాలను  జనసేనకు ఇచ్చేందుకు బీజేపీ సానుకూలంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై దర్యాప్తు జరిపించాలి: రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కిషన్ రెడ్డి మరో వైపు  బీజేపీలో కీలకంగా  ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలు  కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనే  ప్రచారం కూడ లేకపోలేదు. ఈ విషయాలపై  కూడ  కిషన్ రెడ్డి  బీజేపీ అగ్రనేతలతో చర్చించనున్నారు.నవంబర్ తొలి వారంలో రెండో జాబితాను బీజేపీ విడుదల చేసే అవకాశం ఉంది.  ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ అగ్రనేతలు  విస్తృతంగా  ప్రచారం చేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.