బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న కిషన్ రెడ్డి?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర మంత్రిబీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేడు ఢిల్లీలో ఉండి కూడా కేబినెట్ సమావేశానికి హాజరుకాకపోవడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఆయనను తెలంగాణ అధ్యక్ష పదవిని అప్పగించిన అనంతరం అసలు ఆయన ఎక్కడా స్పందించింది లేదు. మీడియా ముందుకు సైతం వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. అయితే ఆయన తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.నిజానికి కిషన్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని ఆశించినట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఈసారి దక్షిణాదికి వస్తుందని కిషన్ రెడ్డి భావించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే జేపీ నడ్డా తరువాత తనకే బీజేపీ పగ్గాలు అప్పగిస్తారని భావించినట్టు తెలుస్తోంది. అలాంటిది తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి అధిష్టానం చేతులు దులుపుకోవడంతో ఆయన మనస్తాపం చెందినట్టు సమాచారం.

పైగా ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి అంత అనుకూల పరిస్థితులు లేవు. కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు వరకూ రెండో స్థానంలో కొనసాగిన బీజేపీ.. ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు తీసుకుంటే రాజకీయంగా మునుగుతామని తన అనుచరులతో కిషన్ రెడ్డి చెప్పినట్టు సమాచారం. మొత్తంగా ఆయన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించేందుకు ఏమాత్రం సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి అలకబూనినట్టు సమాచారం.కాగా  కిషన్ రెడ్డిని మంత్రి వర్గంలో కొనసాగించడంపై సస్పెన్స్ నెలకొంది. సాయంత్రానికి మరికొంత మంది మంత్రులు రాజీనామా చేసే అవకాశం ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.నిన్న కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ చీఫ్‌గా పార్టీ అధిష్టానం నియమించింది. బీజేపీ అధ్యక్షుడిగా నియమించిన అనంతరం ఆయన మీడియా ముందుకు ఇప్పటి వరకూ గమనార్హం. మీడియాతో మాట్లాడటానికి కూడా ఆయన నిరాకరిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలోని ఉండి కూడా ఆయన కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది. సాయంత్రం కిషన్ రెడ్డి బాటలోనే మరికొందరు కేంద్ర మంత్రులు రాజీనామా చేయనున్నట్టు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.