మాణిక్ రావ్ ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేతో ఆ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. నిన్న (బుధవారం) కోమటిరెడ్డికి ఫోన్ చేసిన ఠాక్రే గాంధీ భవన్‌కు రావాల్సిందిగా కోరగా.. ఆయన బయట కలుస్తానని చెప్పారు. ఈ మేరకు ఇవాళ ఎమ్మెల్యే క్వార్టర్ల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఉదయం ఇరువూరు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ కమిటీలపై ఠాక్రేకు కోమటిరెడ్డి ఫిర్యాదు చేశారు. మెుదట్నుంచి పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వటం లేదని అన్నారు. భేటీ తర్వాత మీడియాతో మట్లాడిన కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గంతంలో తనకిచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయన్నారు. పీసీసీ కమిటీలను తాను అసలు పట్టించుకోనని నాలుగైదు సార్లు ఓడిపోయినవాళ్లు పీఏసీలో ఉన్నారని అలాంటి వారితో తాను కూర్చోవాలా ? అని ప్రశ్నించారు. నిన్న గాంధీ భవన్‌కు రాకపోవటంపై మీడియా ప్రశ్నించగా.. ఆయన వివరణ ఇచ్చారు. నియోజకవర్గ పర్యటనల వల్ల నిన్న ఠాక్రేను కలవలేకపోయానని చెప్పారు. జగ్గారెడ్డి, సీతక్క, వీరయ్య ఎందుకు నిన్న గాంధీ భవన్‌కు రాలేదో ముందు వాళ్లను అడగాలన్నారు. తమ ఫోటోలను మార్ఫింగ్ చేసిన విషయాన్ని ఏఐసీసీనే పట్టించుకోవడంలేదని కోమటి రెడ్డి అన్నారు. తన ఫోటో మార్ఫింగ్ అయిందని స్వయానా సీపీగారే తనకు చెప్పారని వెల్లడించారు. ఇంఛార్జ్ ఠాక్రే తనకు కొత్త కాదని.. ఆయనతో తనకు ముందే పరిచయం ఉందని కోమటి రెడ్డి వ్యాఖ్యనించారు. గత కొంత కాలంగా పార్టీకి దూరంతెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. తన తమ్ముడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన నాటి నుంచి ఆయన పార్టీ వ్యవహరాల్లో అంతగా పాల్గొనటం లేదు. తెలంగాణలో జరిగిన రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో కూడా ఆయన పాల్గొనలేదు. దానికి తోడు ఫోటోలు మార్ఫింగ్, మునుగోడు ఉప ఎన్నికల్లో తన తమ్ముడికి మద్దతుగా ప్రచారం చేశారంటూ వీడియోలు, ఆడియోలు రిలీజ్ కావటంతో పార్టీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అప్పటి నుంచి ఆయన గుర్రుగా ఉన్నారు.ఆయన కూడా తమ్ముడి బాటలోనే పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. ఇటీవల తిరుపతి వెంకన్నను దర్శించుకున్న కోమటిరెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు నెల ముందు తన రాజకీయ భవిత్యమేంటో చెబుతానని అన్నారు. పార్టీ మార్పు విషయంపై అప్పుడే క్లారిటీ ఇస్తానని వ్యాఖ్యనించారు. దీంతో ఆయన పార్టీ మార్పు అంశంపై మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. అనంతరం ఐఏసీసీ కమిటీల్లోనూ ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోవటంతో పార్టీకి మరింత దూరమయ్యారు. మరోవైపు కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే రెండో రోజు సమీక్షలు నిర్వహిస్తున్నారు. గాంధీ భవన్‌కు చేరుకున్న ఆయన.. ముందుగా పొలిటికల్ ఎగ్జిగ్యూటివ్ కమిటీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత డీసీసీ, పీసీసీ ఆఫీస్ బేరర్లతో ఠాక్రే భేటీ కానున్నారు. విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం కలిసి కట్టుగా పని చేయాలని ఠాక్రే పార్టీ నేతలతో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.