27న కాంగ్రెస్ లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు మాజీ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఈ నెల  27వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.  కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో  ఫోన్ లో మంతనాలు జరిపారు. ఇవాళ సాయంత్రం  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన  అనుచరులతో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో  కాంగ్రెస్ నుండి బీజేపీలో ఎందుకు చేరాల్సి వచ్చింది, బీజేపీ నుండి కాంగ్రెస్ లో చేరాల్సిన  పరిస్థితులను  తన అనుచరులకు  వివరించనున్నారు.  బీజేపీ నాయకత్వం తీరుపై  కొంతకాలంగా  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు వివేక్ వెంకటస్వామి కూడ బీజేపీని వీడి  కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది.  ఈ నెల  22న బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలకు  చోటు దక్కలేదు.కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డితో  రెండు మూడు దఫాలు చర్చించారు.  ఇవాళ ఉదయం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడ  కేసీ వేణుగోపాల్ తో చర్చించినట్టుగా ప్రచారం సాగుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేసీ వేణుగోపాల్  టిక్కెట్టు విషయమై హామీ ఇచ్చారని  సమాచారం. 2022  ఆగస్టు మాసంలో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. గత కొంతకాలంగా బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలపై  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  అసంతృప్తితో ఉన్నారు. బీజేపీలోని కొందరు  నేతలు  రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారనే ప్రచారం కూడ సాగుతుంది.  ఈ తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.   ఈ నెల  27న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.  కాంగ్రెస్ లో చేరేందుకు  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  రేపు న్యూడీల్లీకి వెళ్లనున్నారు.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో  పాటు వివేక్ వెంకటస్వామి కూడ  బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరుతారని  ప్రచారం సాగుతుంది.  ఈ పరిణామాలపై  బీజేపీ అగ్రనేతలతో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్చించనున్నారు. ఇవాళ  సాయంత్రం  కిషన్ రెడ్డి  న్యూఢీల్లీకి వెళ్లనున్నారు.

Leave A Reply

Your email address will not be published.