హరిరామ జోగయ్య దీక్షకు మద్దతుగా కొట్టె వెంకట్రావ్ దీక్ష

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  హరిరామ జోగయ్య దీక్షకు కొనసాగింపుగా మచిలీపట్నంలో కాపు సంక్షేమ సేన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టె వెంకట్రావ్ దీక్షకు దిగారు. కాపులకు రిజర్వేషన్లు హరిరామ జోగయ్యకు మద్దతుగా వెంకట్రావు దీక్ష చేపట్టారు. గత రాత్రి హరిరామ జోగయ్య దీక్షను పోలీసులు భగ్నం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హరిరామ జోగయ్య దీక్షను తాను కొనసాగిస్తానంటూ మచిలీపట్నం మెయిన్ రోడ్డులో గాంధీనగర్ వద్ద వెంకట్రావ్ దీక్షకు కూర్చున్నారు. దీక్షాస్థలి వద్దకు కాపు సంక్షేమ సేన నాయకులు, కార్యకర్తలు, రాధా-రంగా మిత్ర మండలి సభ్యులు భారీగా చేరుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.