గంప రాజమ్మ దశదినకర్మ లో పాల్గొన్న కేటీఆర్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డి నియోజకవర్గం బస్వా పూర్ లో సోమవారం ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ తల్లి శ్రీమతి రాజమ్మ దశ దిన కార్యక్రమానికి మంత్రి, టీఆరెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. వారితో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ ఈ సందర్భంగా వారు తమ ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.