పాముకాటుతో ఉపాధి కూలీ మృతి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: పాముకాటుతో ఉపాధి కూలీ మృతి చెందిన ఘటన బీర్కూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి  బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన ఎరుకల యాదమ్మ (40) అనే ఉపాధి హామీ కూలి నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం యాదమ్మ ఈ నెల 14వ తేదీన మండలంలోని మల్లాపూర్ గ్రామ శివారులో గల ఎల్లన్న కుంటలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా పాము కాటుకు గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు వారు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.