ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే లక్ష కోట్లు కావాలి
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి లక్ష కోట్ల పైగా బడ్జెట్ కావాల్సి ఉంది.. ప్రభుత్వం మరి ఏ విధంగా ఆదాయ వనరులు సమకూరుస్తుందో చూడాలన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కొత్త ప్రభుత్వానికి (కూటమి) శుభాకాంక్షలు తెలిపారు.. అయితే, అన్నీ నెరవేలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గం అన్నారు.. ఆదాయ వనరులు లేకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోతుందని.. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేదు.. ఇప్పుడు అవకాశం వచ్చింది.. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ రైల్వే జోన్ ను దేశంలో ఎక్కడ లేని విధంగా విభజన చేశారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, ఈ 5 ఏళ్లు చాలా కీలకం, ఇప్పుడు కానీ అభివృద్ధి చేయకపోతే రాష్ట్రం చాలా వెనుకబడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు జేడీ.