పిట్లం మండలంలో చిరుత సంచారం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్న కొడస్దల్ గ్రామ అడవి ప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది. గ్రామానికి చెందిన లింగం పెట్ రమేష్ మిషన్ భగీరథలో విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద భగీరథ నీటి వాల్ మూసేసి ఇంటికి వస్తుండగా.. శివారు ప్రాంతంలో చిరుత కంటపడగా తన కెమెరాలో బంధించి అధికారులకు సమాచారం అందించాడు. దీంతో సమీప ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.