డిమాండ్లు పరిష్కరించని యెడల 5 నుండి సమ్మెకు వెళ్దాం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యం సమ్మెకు సిద్ధమైంది. తమ డిమాండ్లను తక్షణం పరిష్కరించని పక్షంలో 5 నుంచి సమ్మెకు వెళ్తామని హెచ్చరించింది. అద్దె బస్సులకు నిర్వహించిన టెండర్లలో కూడా అద్దె బస్సుల యాజమానులు పాల్గొనలేదు.మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయా ణం చేస్తున్న మహిళలు తమ బస్సులలో పరిమితికి మించి ప్రయాణిస్తున్నారని, మైలేజీ తగ్గుతుందని, బస్సు లు పాడవుతున్నాయని అదె బస్సుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సులో పరిమితికి మిం చి ప్రయాణికులున్న సమయంలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇన్సూరెన్స్‌ వర్తించదని, దీంతో బస్సు యాజమాన్యం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.