కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొడదాం

.. తెలంగాణ తరహాలో మరో మహోద్యమానికి సిద్దం కండి .. తెలంగాణ వచ్చినా ఒరిగిందేమిటి? .. డబుల్ ఇండ్లు రాలే... ఆత్మహత్యలు ఆగలే.. ఆకలిచావులున్నయ్ .. ఎంపీ బండి సంజయ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ పరిస్థితులున్నాయో… రాష్ట్రం ఏర్పడ్డాక కూడా అవే పరిస్థితులు కొనసాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తతం చేశారు. ‘‘తెలంగాణ వచ్చాక డబుల్ బెడ్రూం ఇండ్లు రాలే. ఉద్యోగాలు రాలే. నిరుద్యోగ భ్రుతి అందలే. రుణమాఫీ రాలే.  రైతుల ఆత్మహత్యలు ఆగలే.  స్వర్ణకారులుచేనేత కార్మికులుసహా చేతివ్రుత్తుల ఆకలి చావులు కొనసాగుతూనే ఉన్నాయి. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను రూ.5 లక్షల కోట్ల అప్పు చేసి సాధించిందేమిటో చెప్పాలి.’’ అని డిమాండ్ చేశారు. కేసీఆర్ బిడ్డకు లిక్కర్ స్కాంలో నోటీసులిస్తే… తెలంగాణ ప్రజలు ఎందుకు ధర్నా చేయాలని ప్రశ్నించారు. 1400 మంది పేదల బలిదానంతో ఏర్పడ్డ తెలంగాణలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొట్టడానికి తెలంగాణ తరహాలో మరో మహోద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 6వ రోజు ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా దిలావర్ పూర్ మండల కేంద్రంలో భారీ హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.కెసిఆర్ కు తాగుడుపండుడు తప్ప ఏమీ తెలియదు,ఈ టైం కి కూడా 90 ఎం.ఎల్ తాగి ఉంటాడు,కెసిఆర్ బిడ్డ లిక్కర్ దందా చేసింది,కెసిఆర్ బిడ్డకు నోటీసులు ఇస్తే… తెలంగాణ ప్రజలు ధర్నా చేయాలంట అని ఎద్దేవా చేసారు.1400 మంది అమరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడింది,కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలు దండుకున్నారు,ఇక్కడ కేసీఆర్ షాపులు ఎన్ని ఉన్నాయిని ప్రశ్నించారు.ఊర్లో గుడిబడి లేకపోయినా… బెల్ట్ షాపులు మాత్రం ఉంటాయి,కెసిఆర్ బిడ్డ ఢిల్లీలో లిక్కర్క్యాసినో లో పెట్టుబడులు పెట్టింది,రైతులకు రుణమాఫీ చేయలేదు,దళిత బంధు లేదుదళితులకు 3 ఎకరాల భూమినిరుద్యోగ భృతి లేదు,మహిళలకు రుణాలు ఇవ్వలేదన్నారు.ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కంప్లీట్ చేయలేదు,రోడ్లు లేవు,చదువుకుందామంటే కాలేజీలు లేవు…. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు,కేసీఆర్ ను అభివృద్ధి చేయమంటే పైసలు లేవంటున్నాడు. వేలకోట్లు దండుకోవడానికి మాత్రం పైసలు ఉంటాయన్నారు.లిక్కర్ దందాడ్రగ్స్స్యాండ్ ఇలా అన్నీ దందాలు కేసీఆర్ వే,ఉద్యోగులకు జీతాలు ఇవ్వడు,గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు కూడా కేసీఆర్ పైసలు ఇవ్వడం లేదు,తెలంగాణకు మోడీ 2,40,000 ఇండ్లను మంజూరు చేస్తే… కేసీఆర్ ఇక్కడ ఎన్ని ఇల్లు కట్టించాడు? అని ప్రశ్నించారు.చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేకకనీసం పెళ్లికి పిల్లనివ్వని పరిస్థితి నెలకొంది,రైతులను బికారీలుగా మార్చిండు,వరి వేస్తే ఉరే అంటాడు,సన్న వడ్లుదొడ్డు వడ్లు అంటూ రైతులను ఆగం చేసిండుసన్నవడ్లు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.రైతులకు ఈ ఎనిమిదేళ్లలో ఒక్క పైసా కూడా పంట నష్టం కింద పరిహారం ఇవ్వలేదు,రైతుల పంటకు గిట్టుబాటు ధర ఇవ్వమంటే… రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్దే నన్నారు.ధాన్యం సేకరణలో నిధులను మంజూరు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమే,కేసీఆర్  చేస్తున్నది కేవలం బ్రోకరిజమేఒక్క రైతు బంధు పేరు చెప్పిరైతులకు రావలసిన అన్నింటిని బంద్ చేసిండు,అన్నదాతలకు ఎరువులపై సబ్సిడీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే,ఒక్క ఎకరానికి సబ్సిడీపై 30 వేల రూపాయలు ఇస్తున్నది మోడీ ప్రభుత్వమే. కిసాన్ రైతు సమ్మాన్ నిధి‘ కింద ఎకరానికి రైతుకు రెండు వేల రూపాయలు ఇస్తున్నాడు,రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుకు చేర్చిండు,పుట్టబోయే బిడ్డ పేరుపై కూడా లక్ష రూపాయల అప్పు పెట్టిండు,బీసీల కులవృత్తులను నాశనం చేసిండు,ఎస్టీలకు పోడు భూముల సమస్య పరిష్కరించలేదు,నేను చెప్పే లెక్కలు తప్పయితే… నన్ను ఏమైనా చేయండి,దిలావర్ పూర్ మండలానికి కేంద్రం నుంచి భారీగా నిధులను మంజూరు చేశారు,తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి అంతా… కేంద్రం ఇస్తున్న నిధులతోనేప్రజల కోసం కొట్లాడితే… నన్ను కూడా 3 రోజులు జైలుకు పంపిండు,మీకోసమే సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తున్నా,తిండినిద్ర లేకున్నా…. మీకోసమే తిరుగుతున్న,కేసీఆర్ పాలనలో పేదోళ్లు చచ్చిపోతున్నారు,తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా… అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు.37 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు,ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు,12 మంది స్వర్ణకారులు ఆకలితో ఆత్మహత్య చేసుకున్నారు,లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న తన బిడ్డ కవితను కాపాడుకునేందుకే… కేసీఆర్ మహిళ అనే సెంటిమెంటును రగిలిస్తున్నాడు,నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్… తన కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు,పేదోల్లు కొట్లాడితే వచ్చిన తెలంగాణలో… పెద్దోడు రాజ్యమేలుతున్నాడన్నారు.మహారాష్ట్రలో ఒక్క సంవత్సరంలో… లక్ష ఇండ్లు కట్టించిదసరా రోజే లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించిన ఘనత బిజెపి ది అన్నారు.దిలావర్ పూర్ వచ్చేటప్పుడు ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకున్నఅమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉంటుంది.ఇప్పుడు ఎలక్షన్స్ లేవు… ఓట్ల కోసం రాలేదు… నేను ఇక్కడ పోటీ చేసే వ్యక్తిని కాదు,తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వస్తే… ఉచిత విద్యఉచిత వైద్యంఫసల్ బీమా యోజన అమలు చేస్తాంకెసిఆర్ కబంధహస్తాల్లో బంధీ అయిన తెలంగాణ తల్లినిబంధ విముక్తి రాలని చేద్దాం,తెలంగాణలో బిజెపి ఏర్పడ్డ తర్వాతఇదే చౌరస్తాకు నేను వస్తా,దిలావార్ పూర్ మండలానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులివే..1) జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ మండలానికి 52 కోట్ల 92 లక్షల 90 వేలు ఇవ్వడం జరిగింది.2) 15వ ఆర్థిక సంఘం ద్వారా 4 కోట్ల 50 లక్షలు 62 వేల 573 రూపాయలు.3) స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఈ మండలం లో 2  కోట్ల 7 లక్షల 17 వేల 4 వందల రూపాయల నిధులతో 2838 మరుగుదొడ్ల నిర్మాణం చేయడం  జరిగింది.4) PM కిసాన్ సమ్మన్ నిధి ద్వారా 4449 రైతులకు ప్రతి ఏటా పెట్టుబడి అందివ్వడం జరుగుతుందని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.