ప్రధాని మోడీకి స్వాగతం పలుకుదాం

.. జగనన్న సంక్షేమ పాలన దేశం అంత ప్రచారం చేద్దాం .. ఏపీ వైఎస్ఆర్సిపి మహిళా విభాగం నేత వినీత రెడ్డి కోనాల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  విశాఖపట్నం కి విచ్చేస్తున్న భారత దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా హాజరవుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రజలంతా స్వాగతం తెలియజేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ వైయస్సార్సీపి మహిళ విభాగం నేత వినిత రెడ్డి కోనాల పిలుపునిచ్చారు ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ మరియు బీసీ ప్రతినిధులతో సమావేశమైన మాట్లాడుతూ దేశంలోని ఎక్కడా లేనివిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన చేస్తున్న విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకి ప్రచారం చేసుకునే అవకాశం వచ్చిందని దీనిని వైసీపీ కుటుంబ సభ్యులందరూ వినియోగించుకొని దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలన చేస్తున్న మంచి పనిని ప్రచారం చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డబ్బేరు కుమార్ స్వామి రాష్ట్ర కార్యదర్శి వారణాసి అన్నాజీ రావు జిల్లా కార్యదర్శి డాక్టర్ వైవి నాయుడు వురిటి కృష్ణ ప్రసన్న నవీంద్రారెడ్డి కోనాల పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.