మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌కుమ్రంభీం ఆసిఫాబాద్‌మంచిర్యాలనిర్మల్‌నిజామాబాద్‌జగిత్యాలరాజన్న సిరిసిల్లకరీంనగర్‌పెద్దపల్లిజయశంకర్‌ భూపాలపల్లిసిద్దిపేటకామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. పలుచోట్ల ఉరుములుమెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ విభాగం పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.శుక్రవారం నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడుతాయనిమరికొన్ని చోట్ల మోస్తరు వర్షాపాతం నమోదయ్యే ఛాన్స్‌ ఉందని వివరించింది. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రికొత్తగూడెంజయశంకర్‌ భూపాలపల్లివికారాబాద్‌తో భారీ వర్షాపాతం నమోదవగా.. ఆదిలాబాద్‌కుమ్రంభీం ఆసిఫాబాద్‌నిర్మల్‌నిజామాబాద్‌జగిత్యాలరాజన్న సిరిసిల్లమంచిర్యాలకరీంనగర్హైదరాబాద్‌ జంట నగరాలతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైందని టీఎస్‌డీపీఎస్‌ వివరించింది.

Leave A Reply

Your email address will not be published.