రాగల రెండు రోజుల్లో తెలంగాణలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాగల రెండు రోజుల్లో తెలంగాణలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో వడగాలు వీస్తాయని తెలిపింది.అదే సమయంలో భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.అలాగే బుధవారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా నైరుతి రుతుపవనాలు ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో దక్షిణభారతదేశమంతా విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వివరించింది.

Leave A Reply

Your email address will not be published.