దేశంలో ప్రతి ఒక్కరి స్థిర, చరాస్తులను ఆధార్‌తో అనుసంధానం

    కేంద్ర ప్రభుత్వానికి సూచించిన  ఢిల్లీ హైకోర్టు

 తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: దేశంలో ప్రతి ఒక్కరి స్థిర, చరాస్తులను ఆధార్‌తో అనుసంధానం చేసే విషయాన్ని పరిశీలించి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు సూచించింది. స్థిర, చరాస్తులను ఆధార్‌కి అనుసంధానం చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై(పిల్‌) విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఈ సూచనలు చేసింది. దేశంలో నల్లధనం, అవినీతి, బినామీల నివారణకు ఆధార్‌తో అనుసంధానం ఒక కీలక చర్య అవుతుందని పిటిషనర్‌ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై పూర్తి పరిశీలన అనంతరం విచారణ ముగించినట్లు ధర్మాసనం ప్రకటించింది. పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలను ఒక విజ్ఞాపనగా తీసుకుని పరిశీలించాలని కేంద్రానికి సూచన చేసింది.

Leave A Reply

Your email address will not be published.