తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖుల మెడకు లిక్కర్ స్కామ్ ఉచ్చు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు బేగంపేట ఎయిర్ పోర్టుకు లింకులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. హైదరాబాద్ బేగంపేట నుంచి ఢిల్లీకి ప్రైవేట్ చార్టెడ్ విమానాల ద్వారా నగదు సరఫరా జరిగిందని తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో త్వరలోనే మరిన్ని సంచలనాలు వెల్లడి కానున్నాయి.  తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖుల మెడకు లిక్కర్ స్కామ్ ఉచ్చు బిగుస్తుంది. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక ఆధారాలు సేకరించగ అతి త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల అరెస్టుల పర్వం కొనసాగుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. స్పెషల్ ఫ్లైట్స్ సర్వీసులు అందిస్తున్న జెట్ సెట్‌గో సంస్థ. జెట్ సెట్‌గో సంస్థ సీఈఓగా విజయసాయి రెడ్డి అల్లుడి వదిన కనికా రెడ్డి. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ భార్యే కనికా రెడ్డి కాగా కనికా రెడ్డికి అభిషేక్ బోయినపల్లికి దగ్గర సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెలడి కాగా జెట్ సెట్‌గో సంస్థ కార్యకలాపాలు, లావాదేవీల డేటా సేకరించిన ఈడీ స్పెషల్ ఫ్లైట్స్ లో వెళ్లిన వారి జాబితా సేకరించి బేగంపేట ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ లేకపోవడం, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ చేతిలో ఎయిర్ పోర్ట్ ఉండడంతో నేరుగా రన్ వే పైకి వీఐపీల వాహనాలు వెళ్లడం. వీఐపీలతో కలిసి డబ్బు తరలించిన లిక్కర్ స్కామ్ సూత్రధారులు, పాత్రధారులు పలువురు రాజకీయ నేతల పాత్ర నిగ్గు తేల్చే పనిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల అండతోనే లిక్కర్ స్కామ్ ఖ్జెట్ సెట్‌గో సంస్థ వివరాలపై దర్యాప్తు సంస్థల ఆరా తీస్తున్నాయి. జెట్ సెట్‌గో కార్యకలాపాల వివరాలు ఇవ్వాలంటూ ఎయిర్ పోర్ట్స్ అథారిటీకి లేఖ రాసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జెట్ సెట్‌గో ప్రయాణికుల వివరాల కోసం పలు ఎయిర్ పోర్టుల డైరెక్టర్లకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ లేఖలు రాసినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనాప్పటికీ ఈ లిక్కర్ స్కాం లో పలువురు రాజకీయ నేతల భవిష్యత్తును తారుమారు చేయనున్నట్లు స్పష్టమవుతుంది.

Leave A Reply

Your email address will not be published.