లోకేష్ ఢిల్లీ వెళ్ళిపోయి తన తల్లిని రోడ్లపై తిప్పుతున్నాడు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు పేల్చారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని.. భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకురారన్నారు. చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయిందని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు.. భువనేశ్వరి ఏ స్థాయిలో ఉన్నారన్నారు. రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు రూ.2 వేల కోట్లు దాటిందన్నారు. 40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు రూ.35 కోట్లు ఏ విధంగా ఫీజులు కట్టారని ప్రశ్నించారు. కష్టపడి పొలం దున్నితే వచ్చిన డబ్బుతోనే రూ.ఏడు కోట్లతో రూపొందించిన బస్సులో యాత్ర చేస్తున్నారా? అని ప్రశ్నించారు.2019 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తెర వెనుక టీడీపీకి మద్దతుగా ఉన్నారన్నారు. ఇప్పుడు ముసుగు తొలగిందని..చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ జన సున్నా పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వారసుడు లోకేష్ సమర్థుడు అయితే ఇంట్లో మహిళలు రోడ్లపైకి ఎందుకు వస్తారన్నారు. లోకేష్ పప్పు అని మరోసారి రుజువైందని.. ఢిల్లీ పారిపోయి తల్లిని రోడ్లపై తిప్పుతున్నారన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేటి నుంచి నిజం గెలవాలి పేరుతో యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు అరెస్ట్ వార్త విని చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. తిరుపతి జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతోంది. అలాగే ఈ యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన సభలు, కార్యక్రమాల్లో కూడా భువనేశ్వరి పాల్గొంటున్నారు

 

Leave A Reply

Your email address will not be published.