లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కావాలి

పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కావాల‌ని, అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాల‌ని పార్టీ నేత‌ల‌ను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. చేవెళ్ల లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌తో సోమవారం కేటీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. జ‌న‌వ‌రి 26వ తేదీలోగా స‌మావేశాలు పూర్తి చేసుకోవాల‌ని కేటీఆర్ సూచించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట‌మితో కుంగిపోవ‌ద్ద‌ని, ప‌రాజ‌యం చెందిన బీఆర్ఎస్ అభ్య‌ర్థులే నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్‌ల‌ని, వారు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో విస్తృతంగా ప‌ర్య‌టించాల‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.స‌మీక్ష అనంత‌రం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. త‌న‌ను చేవెళ్ల ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌మ‌ని కేటీఆర్ చెప్పారు. గెలుపే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుంద‌ని కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న అస‌త్య ప్ర‌చారాన్ని తిప్పికొట్టాలి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఓడిన స్థానాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెడుతాం అని రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.