వైసీపీ సీట్ల లొల్లి.. తాడేపల్లి పాలస్కు చేరిన గొడవ
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: వైసీపీ సీట్ల లొల్లి తాడేపల్లి పాలస్కు చేరింది. సీట్ల విశయంలో ఎప్పుడు ఏమి వినాల్సి వస్తుందో అనే ఆందోళనలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సమన్వయకర్తల మార్పులు చేర్పులపై ఇవాళ కూడా కసరత్తు జరుగనుంది. పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య, ఉమ్మారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజులు సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాలల్లో కసరత్తు వికటించడంతో అధిష్టానం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే రాయలసీమ సీట్లపై వైసీపీ అధిష్టానం కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో మంత్రి ఉషా శ్రీ చరణ్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. మంత్రి విశ్వరూప్కు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు వెళ్లింది. దీంతో విశ్వరూప్తో పాటు అమలాపురం సీటు ఆశిస్తున్న శ్రీకాంత్ కూడా క్యాంప్ ఆఫీస్కు రానున్నారు. మరికొందరి మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సీఎంఓ నుంచి పిలుపు వెళ్లింది. దీంతో మంత్రులు విశ్వరూప్, జయరాం సీఎంఓకు చేరుకోనున్నారు. ఎమ్మెల్యేలు రాపాక, చిట్టిబాబు, తిప్పల నాగిరెడ్డి. క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. మంత్రులు గుమ్మనూరు, ఎమ్మెల్యేలు రాపాక, నవాజ్ పాషా సీఎం క్యాంప్ ఆఫీస్కు చేరుకోగా.. మరికొంత మంది ఎమ్మెల్యేలు తాడేపల్లి సీఎంవోకు రానున్నారు.