హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చిన స్వామివారు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఆరో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి హనుమంత వాహనంపై తిరువాడ వీధుల్లో తిరుగుతూ భక్తులకు అభయం ఇచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన హనుమంత వాహన సేవ 10 గంటలకు ముగియనుంది. వాహన సేవల్లో భాగంగా సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథంపై శ్రీవారు ఉరేగనున్నారు. మహిళా భక్తులే ఈ రథాన్ని లాగనున్నారు. ఇక రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గజ వాహన సేవ నిర్వహించనున్నారు

Leave A Reply

Your email address will not be published.