సిరికొండలో భక్తులకు మహా అన్నదానం
రాజన్న సిరిసిల్ల జిల్లా కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో శనివారం దుర్గమ్మ మండపం ఆవరణలో ప్రత్యేక పూజల అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. అన్నదానం పుణ్య కార్యామని, సహకారాన్ని అందించిన ధాతలందరికి దుర్గా ఐక్య కార్యాచరణ సమితి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అమ్మవారి నవరాత్రోత్సవాల్లో భాగంగా అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని దాతలు పేర్కొన్నారు. దుర్గామాత అమ్మవారి కరుణాకటాక్షంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు మండప కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో భవానీ స్వాములు, కమిటీ సభ్యులు మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.