ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’ గా మలిచిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ మలి దశ ఉద్యమానికీ ప్రేరణనందించిన గొప్ప వ్యక్తి దాశరథి అని మంత్రి కొనియాడారు. దాశరథి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తూ హరీశ్రావు ట్వీట్ చేశారు.