భారత్ జోడో యాత్రను విజయవంతం చేయండి

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : భారత్ జోడో యాత్రను పాల్గొని విజయవంతం చేయాలని డిసీసీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం నాడు పిట్లం మండల కేంద్రంలోని సాయి గార్డెన్లో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.   అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ మూడో తేదీన రాహుల్ గాంధీ యాత్ర దానికి సంబంధించి సన్నహ సమావేశాన్ని సాయి గార్డెన్ లో ఉమ్మడి నిజాంబాద్ జిల్లాల కాంగ్రెస్ సమావేశము ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి,మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి జిల్లా సంబంధించిన నాయకులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. నిజాంసాగర్ మండలంలోని నర్సింగరావుపల్లి చౌరస్తాకు రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రవేశిస్తుందని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ సేవాదళ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూనియన్ సంఘాలు కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలంలో నర్సింగ్రావ్ పల్లి కి పాదయాత్రకు స్వాగతం  చెప్పడానికి అందరూ హాజరై జోడో యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో Dసీసీ అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు పిసిసి డెలిగేట్ పల్లి సుభాష్ రెడ్డి కాసుల బాలరాజ్ ఎమ్మెల్యే గంగారం రామ్ రెడ్డి మోహన్ రెడ్డి సురవత్ రెడ్డి హనుమాన్లు తుకారం ఇమ్రోస్ మోయిన్ గోనె శ్రీనివాస్ సర్వర్ పంతులు శ్రీనివాస్, జుక్కల్  మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారం, ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సుభాష్ రెడ్డి, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాసుల బాలరాజ్, పిట్లం నాయకులు న్యాయవాది రామ్ రెడ్డి, జె.హనుమాన్లు, సూరత్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.