మూడు రోజులపాటు శ్రీశైలంలో మల్లన్న దర్శనాలు రద్దు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: శ్రీశైలం క్షేత్రంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శనివారం, ఆదివారం, సోమవారం, మూడురోజుల పాటు మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ పెద్దిరాజు తెలిపారు. తిరిగి మళ్ళీ మంగళవారం నుంచి శుక్రవారం వరకు స్వామి వారి స్పర్శదర్శనలు యాదావిధిగా కొనసాగుతాయని తెలిపారు. కావున శ్రీశైలం వచ్చే భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రావాలని తెలిపారు