గ్రూప్ 4 పరీక్ష కేంద్రంలో సెల్ ఫోన్ తో పట్టుబడ్డ వ్యక్తి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: గ్రూప్ 4 పరీక్షా కేంద్రంలో ఓ అభ్యర్థి సెల్ ఫోన్ తో పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మారుతీనగర్ లోని సక్సెస్ జూనియర్ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత అభ్యర్థి దగ్గర సెల్ ఫోన్ ఉన్నట్లు  ఇన్విజిలేటర్లు గమనించారు. దీంతో ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. పరీక్షా కేంద్రానికి చేరుకున్న పోలీసులు అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ ను సీజ్ చేశారు. ఆ తర్వాత మాల్ ప్రాక్టీస్ కింద అభ్యర్థిపై కేసు నమోదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.