గడ్డి మందు సేవించి వ్యక్తి ఆత్మహత్య
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: విరుగురు మండలంలోని బైరాపూర్ గ్రామానికి చెందిన పందుల సాయిలు అనే వ్యక్తి గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కుడికాలు విరిగిపోవడంతో మానసిక వేదనకు గురై వ్యక్తి శుక్రవారం తన వ్యవసాయ పొలం వద్ద గడ్డి మందు సేవించారు. కుటుంబ సభ్యులు గమనించి 108 లో చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.