ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్లలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పిడుగురాళ్ల ప్రాంత వాసి 22 సంవత్సరాల బత్తుల శాంతరాజు కుటుంబ సభ్యులతో కూలి పనుల నిమిత్తం బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామానికి వచ్చి ఉన్నారు. ఈ నేపథ్యంలో శాంతరాజుకు బండి సైలెన్సర్ కాలి కాలికి గాయమైంది దీంతో దురదగా ఉంది అని స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లగా రేమిడిచర్లకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ సాయి సెప్టిక్ ఇంజక్షన్ చేశాడు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత శాంతరాజు నురగపడుతూ స్పృహ లేకుండా పడిపోయాడు దీంతో శాంతరాజును హుటాహుటిన వినకొండలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించిన ఆర్ఎంపీ డాక్టర్ అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆర్ఎంపీ డాక్టర్ సాయి అక్కడనుండి చిన్నజారుకున్నాడు. దీంతో ప్రైవేటు హాస్పటల్ సిబ్బంది బలవంతంగా మృతదేహాన్ని బయటకు పంపించి వేయడంతో దిక్కుతోచని బంధువులు రోదిస్తూ ఆర్ఎంపీ డాక్టర్ అన్యాయంగా బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.