కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ట్రైనింగ్ కమిటీ సభ్యునిగా మామిడి రిషికేశ్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఆయుధాలుకు పదును పెట్టింది, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే సంకల్పంతో కొన్ని కమిటీలను ఏర్పాటు చేసింది దీనిలో ప్రధానమైన ట్రైనింగ్ కమిటీ కి సభ్యునిగా జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర చైర్మన్ మామిడి రిషికేశ్ రెడ్డి ని నియమించింది. ఈ సందర్భంగా రిషికేశ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధిష్టానం నా మీద నమ్మకం ఉంచి నన్ను ట్రైనింగ్ కమిటీ సభ్యునిగా నియమించిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి ,ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ గారికి, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.