మణిపూర్ సంఘటన చాలా బాధాకరం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మణిపూర్ సంఘటన చాలా బాధాకరమని బిసి మహిళా నాయకురాలు  మట్ట జయంతి డిమాండ్ చేసారు.మహిళలపై జరిగిన అత్యాచారాలతో పాటు హింసకి గురి చేయడం అక్కడి ప్రభుత్వం ఈ సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం దారుణమన్నారు. పార్లమెంట్లో ఇదే అంశ పై మాట్లాడాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి అవకాశం కల్పించలేదు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అక్కడి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలన్నారు.మహిళలకి రక్షణ కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వలదన్నారు.భారత దేశంలో స్త్రీల పట్ల ఇలాంటి అగైత్యాలు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం దీనికి కారకులైన వాళ్లపైన చర్యలు తీసుకోవాలని, స్త్రీమూర్తులని దేవుళ్ళలా కొలిచే మన దేశంలో స్త్రీలకి ఇంత గోరా అవమానమని, ఇప్పటికైనా కేంద్ర ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీనికి కారకులైన వాళ్లపైన చర్యలు తీసుకోవాలని, ఇకముందు ఇలాంటి వి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదన్నారు.

Leave A Reply

Your email address will not be published.