లింగాయత్ తోసహా పలు బీసీ కులాలకు త్వరలోనే జాతీయ ఓబీసీ జాబితాలో చోటు

- జాతీయ ఓబీసీ కమిషన్ హన్సరాజ్ గంగారాం ఆహిర్ హామీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో చాలా రోజులుగా డిమాండ్ లో ఉన్న లింగాయత్ తోపాటు మరికొన్ని కులాలను త్వరలోనే జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తనను కలిసిన జాతీయ ఓబీసీ కమిషన్ ఛైర్మన్ హన్సరాజ్ గంగారాం ఆహిర్ ఈ విషయాన్ని తెలిపారు.

• ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన హన్సరాజ్ ను వీరశైవ లింగాయత్ సామాజికవర్గానికి చెందిన నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సమక్షంలో కలిశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో తమతోపాటు సహా పలు బీసీ సామాజికవర్గాలు ఓబీసీ కమిషన్ ఛైర్మన్ ను కలిసి తమను జాతీయ ఓబీసీ జాబితాలో లేకపోవడంవల్ల విద్య,ఉద్యోగాల పరంగా నష్టపోతున్నామని పేర్కొంటూ వినతి పత్రం అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాము పూర్తిగా జాతీయ ఓబీసీ జాబితాలో చేరేందుకు అర్హులమని పేర్కొన్నారు.

• ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన హన్స్ రాజ్ తప్పకుండా లింగాయత్ తోసహా ఆయా కులాలను జాతీయ ఓబీసీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, వీరశైవ లింగాయత్ పెద్దలు అశోక్ ముస్తాపురే, సంకటాల సోమేశ్వర్, మల్లికార్జున్, చంద్రశేఖర్ తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.