మేడ్చల్ జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మ గూడ నీట మునిగింది. ఇంజినీరింగ్ విద్యార్థులు ఉంటున్న ప్రయివేటు హాస్టల్స్ మొదటి అంతస్తులోకి వరద నీరు వచ్చి చేరింది. సుమారు 15 అపార్ట్మెంట్లలో ఇదే పరిస్థితి నెలకొంది. వరద నీరు హాస్టల్స్లోకి చేరడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థులను పొక్లెయిన్ల సాయంతో బయటకు తరలించారు.ఇక కూకట్పల్లి సర్కిల్ ఆల్విన్ కాలనీ డివిజన్ ధరణి నగర్ కాలనీ రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న పరికి చెరువు నుంచి సమీప ప్రాంతాలకు భారీగా నురగ వస్తోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.