బాన్సువాడలో ఘనంగా మార్కండేయ జయంతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మంగళవారం మార్కండేయ జయంతి సంధర్బంగా బాన్సువాడ పట్టణంలో గల మార్కండేయ మందిరంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి ఛైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో మార్కండేయ స్వామివారికి  ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకుని పద్మశాలి సంఘం అధ్వర్యంలో నిర్వహించిన కలిశాల ఊరేగింపును జెండా ఉపి ప్రారంభించి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు, మహిళలు, యువకులు, బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.