ఢిల్లీలోని ఏమ్స్ లో భారీ అగ్నిప్రమాదం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎయిమ్స్ లోని రెండో అంస్తులో గల ఎండోస్కోపీ రూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అందులోని వారందరినీ బయటకు పంపించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 6 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి.