రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు
తెలంగాణజ్యోతి/ వెబ్ న్యూస్/ నసురుల్లాబాద్: కామారెడ్డి జిల్లా , నసురుల్లాబాద్ మండల పరిధిలోని ఆంకోల్ క్యాంప్ వద్ద లారీ ప్రమాదం జరిగి వంతెన ప్రమాదకరం గా మారిన ప్రాంతంలో మరో ప్రమాదం జరగకుండా ఉండేందుకు ముందస్తుగా లయన్స్ క్లబ్ నసురుల్లాబాద్ మండల కమిటీ అధ్వర్యంలో బుధవారం రోజున వంతెనను పరిశీలించారు. జెసిపి సహాయం తో ఇరుకు వంతెనను సరిచేసి ప్రమాద హెచ్చరికలు బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. లయన్స్ క్లబ్ మండల అధ్యక్షులు వెంకటరమణ, సెక్రటరీ అంబెం మోహన్, లయన్స్ క్లబ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.