అనాధాశ్రమంలో అన్నదానం నిర్వహించిన వాసవి గ్రూప్ సభ్యులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని వర్ని మండల పరిధిలో గల చింతకుంట అనాధాశ్రమంలో శనివారం ప్రపంచ ఆహార దినోత్సవంను పురస్కరించుకుని బాన్సువాడ పట్టణానికి చెందిన వాసవి గ్రూప్ మహిళా సంఘం సభ్యులు అనాధశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాధలకు ఒక పూట కడుపునిండా అన్నం పెట్టడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి గ్రూప్ మహిళా సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.