మంత్రి అంబటి ప్రధాన అనుచరుడు బత్తుల ఆదినారాయణ టీడీపీలో చేరిక

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీడీపీలో చేరికలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇక నేడు మంత్రి అంబటి రాంబాబు ప్రధాన అనుచరుడు ఆయనకు షాక్ ఇచ్చి టీడీపీలో జాయిన్ అయ్యారు. కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో వైసీపీ నేత బత్తుల ఆదినారాయణ టీడీపీలో చేరారు. సత్తెనపల్లి వైసీపీ లీగల్ సెల్‌కు బత్తుల ఆదినారాయణ అధ్యక్షుడిగా ఉన్నారు. మంత్రి అంబటి రాంబాబుకు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. అలాగే ఏపీ కాపునాడు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆదినారాయణ పని చేశారు.

ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ‘‘ప్రముఖ న్యాయవాదిసత్తెనపల్లి వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ ఆదినారాయణ గారు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదినారాయణ గారిని చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాము. రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలతో పాటు మేధావులున్యాయవాదులు కలిసి కట్టుగా కృషి చేయాలి’’ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.