అమర వీరుల సంస్మరణ కార్యక్రమం లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: వరంగల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం జరిగిన పోలీస్ అమర వీరుల సంస్మరణ కార్యక్రమం లో  రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పోలీస్ అమర వీరులకు నివాళులర్పించిన ఎర్రబెల్లి అంతకుముందు పోలీస్ ల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కొందరు పోలీస్ అమర వీరులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ. విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరులకు నివాళులు. రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని అమలు చేస్తూ, సమాజాన్ని సక్రమ మార్గంలో పెడుతున్నది పోలీస్ లే అన్నారు.

పోలీస్ వృత్తి అనేక వత్తిడిలతో కూడుకున్నది, పోలీస్ లు తమ వృత్తి ధర్మం కోసం, కుటుంబాల ను కూడా లెక్క చేయకుండా పని చేస్తున్నారు. పోలీస్ లు కొందరు కర్తవ్య నిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వారి అలాంటి వారి త్యాగాలు గొప్పవి. వారి కుటుంబాలను సరైన రీతిలో ఆదరించడం, గౌరవించుకోవడం మన విధి.నేను రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుండి ఈ కార్యక్రమంలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నాను, ఈ కార్యక్రమంలో సిపి తరుణ్ జోషి వివిధ స్థాయిల పోలీసు అధికారులు, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.