జేపీ నడ్డా పై మంత్రి హరీశ్ రావు ఫైర్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:
జేపీ నడ్డా పై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. 2016 లో ఇచ్చిన హామీలపై నిలదీత మీ హమీలు ఏమయ్యాయి?
2016లో మర్రిగూడలో నాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా, మీరు పర్యటిస్తూ, ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తమన్నరు. మీరు హమీ ఇచ్చి ఆరేళ్లయింది. ఈ సెంటర్ ఏర్పాటు కోసం 8.2 ఎకరాల స్థలం చౌటుప్పల్ లో తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది ఆరేళ్లయినా కేంద్రం ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ కు నయా పైసా ఇవ్వలేదు.మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తమని కూడా హమీ ఇచ్చారు.అబద్దపు హమీలిస్తూ,ప్రజా గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏం మోహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నరని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.