విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు మంత్రి సబితా పలు కీలక సూచనలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ఇంటర్ పరీక్షలలో మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. ఫస్టియర్‌లో 63.85 శాతం, సెకండియర్‌లో 67.26 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు మంత్రి, విద్యాశాఖ అధికారులు పలు కీలక సూచనలు చేశారు.

  • ఫెయిల్ అయిన విద్యార్థులు భాధపడొద్దు.. ఆందోళన చెందవద్దు
  • పిల్లలపై తల్లిదండ్రులు ఫెయిల్ అయితే సీరియస్ అవ్వొద్దు
  • ఫలితాలపై ఎవరికైనా సందేహాలు ఉంటే రీ- వెరిఫికేషన్ చేసుకోవచ్చు
  • మే- 10 నుంచి మే- 16 వరకు సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులు ఫీజు చెల్లించుకోవచ్చు
  • జూన్ 4 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి
  • సెకండియర్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు
  • ఎంసెట్ రాసేవాళ్ళు ఇంటర్మీడియట్ ఫలితాలను పట్టించుకోవద్దు
  • ఎంసెట్ రాసేవాళ్ళు ప్రశాంతంగా పరీక్షలు రాయండి
  • విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దనే ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగించాం
  • ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రభుత్వ కళాశాలలో మెరుగ్గా ఉంది
  • జూనియర్ కాలేజీలు రెసిడెన్షియల్ పాఠశాలతో పోటీ పడాలి
  • ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీల్లో 46శాతం మాత్రమే ఫలితాలు ఉన్నాయి

ఇదిగో హెల్ప్‌లైన్.. కాల్ చేయండి..

  • ఇంటర్ విద్యార్థుల కోసం టెలీ మాసన్ హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశాం
  • హెల్ప్ లైన్ నెంబర్ 14416 కు కాల్ చేసి సలహాలు, సూచనలు పొందవచ్చు
  • ఈ నంబర్ విద్యార్థులకు పరీక్షా సమయంలో కూడా ఉపయోగపడంది
  • ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడే వారికి ఇది అండగా ఉంటుంది

 4.33 లక్షల మంది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాశారు. ఇందులో 2.72 లక్షల మంది మాత్రమే పాసయ్యారు. ఇందులో బాలికలే ఎక్కువ మంది పాసయ్యారు. A గ్రేడ్, 1.60 లక్షల మంది, B గ్రేడ్ 68,333 మంది పాసయినట్లు సబిత తెలిపారు. ఫస్టియర్‌ ఫలితాల్లో మేడ్చల్‌.. సెకండియర్‌లో ములుగు జిల్లాలు ప్రథమ స్థానంలో నిలిచినట్లు మంత్రి వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.