జర్నలిస్ట్ మురళి మోహన్ మృతికి మంత్రి సింగిరెడ్డి సంతాపం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ఇలపావులూరి మురళీ మోహన్ (68) గుండెపోటుతో మరణించడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. ఇలపావులూరి మురళీమోహన్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.