కెసిఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న మంత్రి తలసాని

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీఎం కేసీఆర్ నుంచి సనత్‌నగర్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ బీ-ఫామ్ అందుకున్నారు. ప్రగతి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ను మంత్రి తలసాని శుక్రవారం క‌లిశారు. ఈ సంద‌ర్భంగా బీ-ఫామ్‌ను మంత్రికి అంద‌జేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీ స్థానిక శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చి అందరం కలిసికట్టుగా మంత్రి తలసాని గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.