సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నివాళులర్పించిన మంత్రి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్:  భారత స్వాతంత్ర్య సమర యోధులు, స్వతంత్ర భారతదేశం మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మొదటి హోం శాఖ మంత్రి, 565 సంస్థానాలను స్వతంత్ర భారతదేశంలో విలీనం చేసి, ఉక్కు మనిషిగా ప్రఖ్యాతి గాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఆయనకు నివాళులు అర్పించారు. భారత దేశ సమగ్రత కోసం పటేల్ చేసిన కృషిని గుర్తు చేశారు. ఉక్కు మనిషి పటేల్ స్ఫూర్తిగా ఉక్కు సంకల్పంతో భారత సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ విజయం కోసం మనమందరం కంకణ బద్దులం కావాలని ఎర్రబెల్లి ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.