తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీలో పోలీసుల రాజ్యం నడుస్తోందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… రైతుల పాదయాత్రను అడ్డుకోవడం పోలీసులకు తగదన్నారను. హైకోర్టు అనుమతితోనే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. రైతుల యాత్రకు జగన్ సర్కార్ కావాలనే అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. అమరావతి రాజధానిని మార్చాలనే మంత్రుల డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. మంత్రులకు దమ్ముంటే రాజీనామాలు చేయాలని రామకృష్ణ సవాల్ విసిరారు.