ఈవీఎంలను ఎత్తుకెళ్లేందుకు దుండగుల యత్నం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/బ్యూరో చీఫ్: మునుగోడు బైపోల్ ఓటింగ్ అనంతరం ఈవీఎంలను తీసుకెళ్తున్న బస్సును కొందరు వెంబడించడం కలకలం రేపింది. ఈవీఎంలతో నల్గొండ వెళ్తున్న బస్సును కారులో కొందరు ఫాలో అవ్వడం గమనించిన పోలీసులు ఆ వాహనాన్ని పట్టుకునేందుకు కిందకు దిగారు. పోలీసులను చూసిన కారులోని ఐదుగురు వ్యక్తులు వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయారు. పోలీసులు కారును జప్తు చేశారు. ఈవ్యవహారంపై ఉన్నతాధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.