మియాపూర్ ప్రభుత్వ భూములను బీసీ గురుకుల పాఠశాలకు కేటాయించాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ భూములను రాజకీయ నాయకులు, అధికారులు కబ్జా చేస్తున్నారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలనిరాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేసారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూముల పై నేడు బిసి భవన్ లో – రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ లాల్ కృష్ణ అద్యక్షతన బిసి సంఘాల సమావేశం జరిగింది.ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రమంతా భూకబ్జామయం గా మారింది. ప్రభుత్వమే – ప్రభుత్వ భూములను వేలం వేసే రియల్ ఎస్టేట్ సంస్థలుగా తయారైంది. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురైతే వేలం వేస్తే భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు, ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఒక అంగుళం భూమి కూడామిగలదు. ప్రస్తుతం మియాపూర్ లో 60 ఎకరాల భూమిని తోట చంద్రశేఖర్ అనే ఒక కాంట్రాక్టర్ కు ఎలా ఇస్తారు.అలాగే షేక్పేట్ లోని 32