కేటీఆర్ గారిని సత్కరించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

- మంత్రి గారితో కలిసి పలు కార్యక్రమాలకు హాజరు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిజామాబాద్ నగరంలో బీఆర్ ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన గౌరవ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారిని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఘనంగా సత్కరించారు. కేటీఆర్ గారు శనివారం నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన సంగతి విదితమే. బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రి కేటీఆర్ గారితో కలిసి హెలీ క్యాప్టర్ లో జీవన్ రెడ్డి నిజామాబాద్ నగరానికి వచ్చారు. పాత కలెక్టరేట్ ఆవరణలో 50కోట్ల రూపాయలతో చేట్టిన కళాభారతి భవనానికి మంత్రి కేటీఆర్ గారు భూమి పూజ నిర్వహించిన కార్యక్రమంతో పాటు రైతులతో జరిగిన కేటీఆర్ గారి ముఖాముఖిలోను ఆయనతో కలిసి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం బీఆర్ ఎస్ జిల్లా కార్యాలయం సందర్శనకు వచ్చిన మంత్రి కేటీఆర్ గారికి పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో జీవన్ రెడ్డి స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన కేటీఆర్ గారు జీవన్ రెడ్డి చాంబర్ లోకి వచ్చి ఆయనను అభినందించారు. ఈసందర్భంగా జీవన్ రెడ్డి పూలమాలలు, శాలువాతో కేటీఆర్ గారిని సన్మానించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలోనూ కేటీఆర్ గారితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్, రూరల్ ఎమ్మెల్యే,ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, బోధన్ ఎమ్మెల్యే షకీల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.