ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జాకోరు

- వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జాకోరని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. శంకర్‌నాయక్ అభ్యంతరకరంగా మాట్లాడారని, ఓ ఎమ్మెల్యే మాట్లాడాల్సిన పదమేనా? అని ప్రశ్నించారు. వాళ్లంటే తప్పులేదా? మేమంటేనే తప్పా?.. మహిళలు అంటే అంత చిన్నచూపా?.. ఆడవాళ్లు అయితే ప్రశ్నించకూడదా? అని షర్మిల ప్రశ్నించారు. కనుసైగ చేస్తే చాలు తమ పార్టీ కార్యకర్తలు తరిమి కొడతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ వేశారు. శంకర్ నాయక్ సైగ చెయ్యి.. ఎవడోస్తాడో చూస్తా అంటూ సవాల్ విసిరారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు ఈ వైఎస్సార్ బిడ్డ అని ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లా నెళ్ళికుదురు మండల కేంద్రంలో మాట్లాడిన షర్మిల.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మాటలతో ఎదురు దాడి చేసిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.