మంత్రి ఎర్రబెల్లి తో సమావేశమైన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరియు బోధన్ ఎమ్మెల్యే షకీల్ గారు మంగళవారం నాడు సమావేశమయ్యారు. బోధన్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి ఎర్రబెల్లి గారితో ఎమ్మెల్సీ కవిత చర్చించారు. హైదరాబాదులో మంత్రి ఎర్రబెల్లి గారి నివాసంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే షకీల్ గారితో పాటు బోధన్ స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.